Pawan Kalyan: జూదం క్లబ్బులు కావాలా...? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా?: పవన్
వైకాపా ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు.
గణపవరం: వైకాపా ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందకపోయినా.. జూదం, మద్యం, ఇసుక దోపిడీలో బాగా అభివృద్ధి చెందిందని ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో 3.80 లక్షల మంది విద్యార్థులు పాఠశాల మానేశారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
ఒక్క ఛాన్స్ అని.. నట్టేట ముంచేశారు
‘‘ఒక్క ఛాన్స్ అంటే.. నమ్మి అందరూ ఓట్లేశారు. అలాంటి ప్రజలను జగన్ నట్టేట ముంచేశారు. రాష్ట్రం మాఫియా మయమైపోయింది. ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో ఐదేళ్లలో 62వేల మంది విద్యార్థులు చనిపోయారు. వారికిచ్చే చిక్కి ప్యాకెట్ల మీద కూడా రూ. 67 కోట్లు దోచేశారు. పిల్లలకు ఇచ్చే పుస్తకాల మీద కూడా జగన్ ఫొటో ముద్రిస్తున్నారు. ఐదేళ్ల నుంచి బెయిల్పై ఉన్న వ్యక్తి జగన్.. ఇలాంటి వ్యక్తి ఇవాళ పోలీసులపై పెత్తనం చేస్తున్నారు. సీఎం స్థానంలోని వ్యక్తి సరైనవారా కాదా అని ప్రజలు ఆలోచించాలి. దోపీడీ చేసే రాజకీయ నాయకులకు ఏం పని? ఎంత ఆదర్శవాదం ఉన్నా క్రిమినల్స్ను భూజాన పెట్టుకోవద్దు
సీపీఎస్కు పరిష్కారం చూపిస్తా
మన సమాజంలో గురువులకు ఎంతో ఉన్నత స్థానం ఉంది. అలాంటి గురువులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించారు.. మద్యం షాపుల వద్ద కాపలా కాయించారు. ఒక ఉద్యోగిగా చెబుతున్నా.. అసెంబ్లీలోకి అడుగుపెట్టగానే సీపీఎస్కు పరిష్కారం చూపిస్తా. వైకాపా గూండాలకు చెబుతున్నా.. మా కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోను. తెగించి కూర్చున్నా.. తాటాకు చప్పుళ్లకు భయపడను. అప్పటికి వినకపోతే ప్రభుత్వం వచ్చాక వారి తాట తీసి రోడ్లపై తిప్పిస్తా. జగన్ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.
వైకాపా నేతలకు భూముల పిచ్చి
ఉంగుటూరులో మట్టి అమ్ముకునే వారు కాదు.. ధర్మరాజులాంటి బలమైన నాయకుడు కావాలి. దేవుడు భూములు లాక్కొని కనీసం లీజు కూడా చెల్లించట్లేదు. వైకాపా నాయకులకు భూముల పిచ్చి ఎక్కువైంది. కానీ, ఎవరైనా ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. కొల్లేరులో కాంటూరు సమస్య కారణంగా చేపల చెరువుల వాళ్లు ఇబ్బంది పడుతుతున్నారు. కాంటూరు లెక్కలు తేల్చే బాధ్యత మాది. కొల్లేరు సరస్సు కలుషితం కాకుండా మేం బాధ్యత తీసుకుంటాం. పేరుకే ఇది డెల్టా ప్రాంతం.. కానీ, తాగడానికి నీళ్లు ఉండవు. వైకాపా ఊరూరా మద్యం అమ్మిస్తోంది.. కానీ, ఇంటికి మంచి నీళ్లు ఇవ్వట్లేదు. ఆక్వా రైతాంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. నాణ్యమైన రొయ్య పిల్లలు రైతులకు అందట్లేవు. రొయ్యల ధరలు కూడా దారుణంగా పడిపోయాయి. ప్రస్తుత ఎమ్మెల్యే వాసుబాబు మళ్లీ కావాలా వద్దా మీరే ఆలోచించుకోండి. ఒక ఎమ్మెల్యే అయి ఉండి తన ఇంటికే రోడ్లు వేయించుకోలేని వ్యక్తి మనకు రోడ్లు ఏం వేయిస్తాడు?’’అని పవన్ ఎద్దేవా చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం: మాజీ మంత్రి సోమిరెడ్డి
ఓటమి భయంతోనే వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్, డీజీపీ.. మధ్యాహ్నం ఈసీ ముందుకు..
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా దిల్లీ చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వారిని వివరణ కోరిన విషయం తెలిసిందే. -
పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైకాపా నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. -
తెదేపా నేత నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
తెదేపా నేత నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. -
తప్పించారా.. తప్పించుకున్నారా?: పులివర్తి నానిపై దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం
చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి పాల్పడిన దుండగులు తప్పించుకున్నారా లేక పోలీసులు తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలింగ్ బూత్లో మాజీ ఎమ్మెల్యే మద్దాళికి ఘోర పరాభవం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్కు మహిళల నుంచి ఘోర పరాభవం ఎదురైన ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
వైకాపా నేతలకు.. తిరుపతి ఎస్పీ భయపడుతున్నారు
వైకాపా నేతలను చూసి తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ భయపడుతున్నారని తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి విమర్శించారు. -
ఎన్ఆర్ఐల సమస్యలు పరిష్కరిస్తాం: చంద్రబాబు
విదేశాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి స్వరాష్ట్రానికి వచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం అనన్యసామాన్యమని తెదేపా అధినేత చంద్రబాబు ప్రవాసాంధ్రులను కొనియాడారు. -
భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయం
రాష్ట్రంలోని పది అసెంబ్లీ, ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ విస్తారక్లు రాష్ట్ర నాయకత్వానికి నివేదించారు. -
తెదేపా కార్యకర్త పీక కోసిన వైకాపా అరాచకం
ఏలూరు నగరానికి చెందిన ఓ యువకుడు తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన పీక కోసేందుకు కొందరు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించారు. -
ఏపీలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్లో వంద శాతం ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన దిల్లీలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. -
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. వైకాపా తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఇటీవల ఆ పార్టీని వీడి, తెదేపాలో చేరారు. -
పిన్నెల్లి సోదరుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు?
పోలింగ్ సమయంలో, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మూకలు పెద్దఎత్తున అరాచకం సృష్టించాయని... 119 విధ్వంస ఘటనలు చోటుచేసుకొన్నాయని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
సంక్షిప్త వార్తలు (9)
తెదేపా అధినేత చంద్రబాబు గురువారం కొల్హాపుర్, షిర్డీల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి విమానంలో కొల్హాపుర్ చేరుకుని మహాలక్ష్మీ అమ్మవారిని సందర్శిస్తారు. -
చర్యలు మొదలయ్యాయి!
పోలింగ్ సమయంలో, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి చర్యలు మొదలయ్యాయని.. అందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ హరీష్కుమార్గుప్తాల్ని దిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించిందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్ చెప్పినట్లు ఎన్డీయే నేతలు వెల్లడించారు. -
పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన చెవిరెడ్డి.. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత
తిరుపతి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. -
సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. -
నన్ను కాపాడింది అతడే.. లేదంటే ప్రాణాలు పోయేవి: పులివర్తి నాని
తిరుపతిలో తనపై జరిగిన హత్యాయత్నం గురించి చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని వెల్లడించారు. -
ఓటమి ఖాయమని తెలిసే ప్లాన్ బీ అమలు చేశారు: వర్ల రామయ్య
ఎన్నికల్లో వైకాపా సృష్టించిన అరాచకాలపై కూటమి నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. -
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయం: కిషన్రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
పోలీసుల అదుపులో తెదేపా నేత బాజీచౌదరి.. కుంకలగుంటలో ఉద్రిక్తత
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని కుంకులగుంటలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తాజా వార్తలు
-
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?